Seed Shortage : విత్తనాల కొరత.. రంగంలోకి అధికారులు, పోలీసులు

Seed Shortage : విత్తనాల కొరత.. రంగంలోకి అధికారులు, పోలీసులు
X

ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో పలు జిల్లాలల్లో వ్యవసాయ అధికారులతో పాటు పోలీసులు సీడ్స్ షాపులలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.రాష్ట్రంలో రైతులకు పత్తి విత్తనాల కొరత ఏర్పడకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశించడంతో నేడు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని నేతాజీ కూడలిలో పలు సీడ్స్ షాపులలో పత్తి విత్తనాల స్టాక్స్, తదితర వివరాలపై జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తోపాటు పట్టణ పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.

సీడ్స్ షాపుల డీలర్లు రైతులకు సరఫరా చేస్తున్న విత్తనాల వివరాలు రికార్డులను వారు పరిశీలించారు. సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన పత్తి విత్తనాలను డీలర్లు అందజేయాలని వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు రికార్డులలో వివరాలను నమోదు చేసుకోవాలని కృత్రిమ కుర్తా సృష్టించి రైతులను ఇబ్బంది పెట్టకూడదని అలాగే రైతులు కూడా డీలర్ల వద్ద నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయాలని నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోకూడదని వారు సూచించారు. మరోవైపు డీలర్లు కానీ అక్రమ వ్యాపారులు కానీ జీరో బిటి పత్తి విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags

Next Story