Special Buses : పోలింగ్ సందర్భంగా ప్రత్యేక బస్సులు
By - Manikanta |11 May 2024 8:36 AM GMT
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ ప్రయాణికుల కోసం TSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీనిపై సంస్థ ఎండీ సజ్జనార్ ప్రత్యేక ప్రకటన చేశారు. కేవలం ఎన్నికల సందర్భంగానే తెలుగు రాష్ట్రాలకు TSRTC రెండువేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ప్రకటించారు.
హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ప్రధాన బస్ స్టేషన్లనుంచి నుంచి జిల్లాలకు ఈ బస్సులు నడవనున్నాయి. MGBS నుంచి 500, జేబీఎస్ నుంచి 200 ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఉప్పల్, ఎల్బీనగర్ నుంచి 300 చొప్పున ప్రత్యేక బస్సులు తిప్పుతున్నారు.
దీంతో పాటు.. 58 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఓటర్లు సురక్షింతగా ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకుని పోలింగ్ లో పాల్గొనాలని ప్రజా రవాణా సంస్థలు కోరాయి
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com