TS : రాయ్బరేలికి CM రేవంత్ రెడ్డి.. అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ముందస్తు షెడ్యుల్ ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. ప్రత్యేక విమానంలో హుటాహుటిన రాయ్ బరేలికి వెళ్లారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలి నుంచి పోటీ చేయనున్నట్లు ఈ ఉదయం ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది పార్టీని అలర్ట్ చేసింది. దీంతో రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో రాయ్ బరేలి బయల్దేరి వెళ్లారు.
ఆయనతో పాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఒకే విమానంలో రాయ్ బరేలి వెళ్లారు. సోనియాగాంధీ ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎంపికవగా.. ఆమె పోటీ చేసే స్థానం రాయ్ బరేలి నుంచి రాహుల్ గాంధీ బరిలో నిలవనున్నారు. అమేథి నుంచి కిషోర్ లాల్ శర్మను కాంగ్రెస్ బరిలో నిలిపింది.
రాహుల్ నామినేషన్ ర్యాలీని భారీగా ప్లాన్ చేసింది కాంగ్రెస్. రెండు స్థానాల్లో రాహుల్ గెలిచేలే స్టార్ క్యాంపెయినర్లను బరిలో దింపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com