Bridge Collapsed : గాలి దుమారానికే కూలిన నిర్మాణంలోని వంతెన!

Bridge Collapsed : గాలి దుమారానికే కూలిన నిర్మాణంలోని వంతెన!
X

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని గర్మిల్లపల్లి-పెద్దపెల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడు గ్రామాల మిడమానేరు వాగుపై నిర్మాణం మధ్యలో ఆగిపోయిన వంతెన మళ్లీ కూలింది. గ్యాడర్లు (బెడ్లు) మంగళవారం సాయంత్రం వీచిన గాలికి కూలిపోయాయి. తాత్కాలిక రోడ్డుపై పడగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. గతేడాది జులై నెలలో వరదలకు టేక మట్ల-రాఘవరెడ్డి పేట గ్రామాల మధ్యలోని చలివాగుపై నిర్మించిన వంతెన వరదకు కొట్టుకుపోయింది. ఇప్పుడు గాలికి వంతెన కూలడం మళ్లీ 5 పిల్లర్లు కూలడంతో మండలంలో చర్చనీయాంశం అవుతోంది.

ఓడేడు నుంచి భూపాలపల్లి జిల్లా గుర్కిళ్లపల్లి మధ్య దూరం తగ్గించేందుకు మానేరు నదిపై 2016లో బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే కాంట్రాక్టర్లు మారడం, నిధుల లేమితో వంతెన నిర్మాణం ఆగిపోయింది.

Tags

Next Story