TG : హరితహారం పేరును మార్చిన కాంగ్రెస్ సర్కార్

TG : హరితహారం పేరును మార్చిన కాంగ్రెస్ సర్కార్
X

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ పేరు మారింది. ఆ కార్యక్రమాన్ని ‘వనమహోత్సవం’గా మారుస్తూ కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జులై మొదటి వారం నుంచి 9 విడతలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కానున్నారు. టేకు, వేప, కానుగ, సుబాబులు, చింత, మామిడి, నిమ్మ, జామ, కొబ్బరి వంటి పలు రకాల మొక్కలను పెంచనున్నారు.

ఉమ్మడి తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు వన మహోత్సవం పేరుతోనే పచ్చదనం పెంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. 1950లో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. 75 సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో తాజా కార్యక్రమానికి 'వజ్రోత్సవ వన మహోత్సవం'గా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని రేవంత్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ష్ట్రవ్యాప్తంగా ఈ సంవత్సరం ‘వనమహోత్సవం’ కార్యక్రమంలో 20.02 కోట్ల మొక్కలు నాటనున్నారు. గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పురపాలక శాఖ పరిధిలో 10.09 కోట్ల మొక్కలు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ 6.37 కోట్లు, అటవీశాఖ పరిధిలో 1.34 కోట్ల మొక్కలు నాటాలని నిర్దేశించింది

Tags

Next Story