TS : మూడు జిల్లాల్లో 2 రోజులు వైన్స్‌ బంద్

TS : మూడు జిల్లాల్లో 2 రోజులు వైన్స్‌ బంద్
X

తెలంగాణలో ఈనెల 27న వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాల్లో ఈనెల 25 సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్స్, బార్లు బంద్ చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు.

దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పట్టభద్రుల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు

Tags

Next Story