TS : వరంగల్ బీఆర్ఎస్ క్యాండిడేట్ ఖరారు!

వరంగల్ లోక్సభ అభ్యర్థిపై కేసీఆర్ కసరత్తు ఫైనల్ కు చేరుకుంది. కేసీఆర్ ను అంటి పెట్టుకుని ఉన్న నేతలకే చాన్సివ్వాలని భావిస్తున్నారు. టిక్కెట్ రేసులో ఉన్న ప్రధాన దళిత నేతలంతా గుడ్ బై చెప్పడంతో… అభ్యర్థి ఎంపిక క్లిష్టంగానే మారింది. కడియం బయటకు వెళ్లిపోగానే… మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం జరిగింది. ఐతే.. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరలేకపోయారు.
కాంగ్రెస్ పార్టీ ఆయన్ను చేర్చుకోలేదు. దీంతో.. రాజయ్య పొలిటికల్ క్రాస్ రోడ్ లో నిలబడిపోయారు. కేసీఆర్ పిలిస్తే చాలు ఆయన చేరిపోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటి వరకూ ఆయనకు పిలుపు వెళ్లలేదు. బీఆర్ఎస్ అధిష్టానానికి రాజయ్యపై కూడా నమ్మకం లేకపోవటమే ఇందుకు కారణం. చిన్న కారణాలతో పార్టీ మారిన ఆయన్ను అంతగా విశ్వసించలేమని బీఆర్ఎస్ బాస్ భావిస్తున్నారు. దీంతో.. వరంగల్ అభ్యర్థి ఎంపికపై వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్లతోపాటు పార్టీలోని ముఖ్య నేతలతో కేసీఆర్ గత కొద్ది రోజులుగా మంతనాలు జరుపుతున్నారు.
ఉద్యమ నేత పరంజ్యోతి, హన్మకొండ జడ్పీ చైర్పర్సన్ సుధీర్ కుమార్ తదితరుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకర్ని ఎంపిక చేసి ప్రకటించే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. కడియం కావ్యను ఢీకొట్టేలా సరైన క్యాండిడేట్ నే కేసీఆర్ ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com