TS : వరంగల్‌ ఎంపీ బరిలో తాటికొండ రాజయ్య?

TS : వరంగల్‌ ఎంపీ బరిలో  తాటికొండ రాజయ్య?

Warangal : వరంగల్‌ పార్లమెంట్‌ స్థానంలో కాంగ్రెస్‌, బీజేపీకి దీటుగా బలమైన అభ్యర్థిని బరిలో దించాలని బీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య పోటీ నుంచి తప్పుకోవడం, కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగడంతో కొత్త అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం అన్వేషిస్తోంది. కావ్యను ఓడించేందుకు తగిన ప్రత్యర్థిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పెద్ది స్వప్న, పరంజ్యోతి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే వీరిలో స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు టికెట్ దక్కే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లిన రాజయ్య యూ టర్న్ తీసుకుని మళ్లీ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. . ఎంపీ టికెట్ హామీ ఇస్తే రాజయ్య గులాబీ కండువా కప్పుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయనతో కలిసి మంతనాలు కూడా జరిపినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story