TS : బీజేపీలోకి పెద్దపల్లి ఎంపీ... అభ్యర్థిని మారుస్తారా!
పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇటీవలే వెంకటేశ్ నేత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. మరోవైపు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను ఆ పార్టీ ఎంపిక చేసింది. దీంతో అసంతృప్తికి గురైన వెంకటేశ్ ఇప్పుడు బీజేపీలో చేరనున్నట్లు టాక్.
అయితే.. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. అయితే.. సిట్టింగ్ ఎంపీగా ఉన్న వెంకటేష్ నేత బీజేపీలో చేరితే.. ఇప్పటికే ప్రకటించిన గోమాస శ్రీనివాస్ను మార్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
బోర్లకుంట వెంకటేశ్ నేత 2018లో కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత.. 2019లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరిన వెంకటేశ్ నేత.. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com