TS : జీరో కరెంట్ బిల్లు రాలేదా.. ఇలా చేయండి

రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth reddy Government) ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్ల వరకు గృహజ్యోతి పథకం కింద ఉచితంగా అందిస్తోంది. ఈపథకాన్ని మార్చి 1 నుంచే అమల్లోకి తెస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. తెల్ల రేషన్ కార్డు ఉండి.. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారిని అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. అయితే.. హైదరాబాద్ నగరంలో సున్నా కరెంట్ బిల్లులకు రంగం సిద్ధమైంది.
విద్యుత్ బిల్లులతో రేషన్ కార్డు అనుసంధానమైన వినియోగదారులకు ఈ పథకం వర్తింపజేయనున్నారు అధికారులు. 200 యూనిట్లలోపు విద్యుత్ వాడకం ఉన్న అందరికీ మార్చి నెల జీరో బిల్లు వస్తుంది. విద్యుత్ అధికారులు ఈ మేరకు బిల్లింగ్ సాఫ్ట్వేర్లో ఇప్పటికే మార్పులు చేశారు. కొత్త బిల్లింగ్ యంత్రాలను కూడా కొనుగోలు చేశారు. అన్ని సెక్షన్లలో మార్చి 1వ తేదీ నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులకు సీఎండీ ఆదేశాలు జారీ చేశారు.
ఇంట్లో 200 యూనిట్లలోపు విద్యుత్ను వాడి, తెల్లరేషన్ కార్డు ఉండి కూడా ఏదైనా టెక్నికల్ లోపంతో జీరో కరెంటు బిల్లు రాకపోతే ఇలా అప్లై చేయొచ్చని అధికారులు సూచించారు. మున్సిపల్, మండల కార్యాలయాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పింది. ఆహార భద్రత కార్డు, దానికి లింక్ చేసిన ఆధార్, గృహ విద్యుత్ కనెక్షన్ల నంబర్ను దరఖాస్తుతో పాటు సమర్పించాలని వివరించింది. విద్యుత్ సిబ్బంది అర్హుల జాబితాలో వారి పేర్లను చేరుస్తారని వెల్లడించింది. అప్రూవల్ వచ్చాక నెక్స్ట్ మంత్ నుంచే ఫ్రీ కరెంట్ స్కీమ్ లో చేరొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com