Tamilnadu : వలలో అరుదైన, వింత చేప

X
By - Manikanta |18 Jun 2025 6:00 PM IST
తమిళనాడు సముద్ర తీరంలో ఓ అరుదైన, వింతైన చేప మత్స్యకారుల వలకు చిక్కింది. సుమారు 30 అడుగుల పొడవున్న ఈ చేపను 'ఓర్ ఫిష్' అని పిలుస్తారు. సముద్ర గర్భంలో అత్యంత లోతున నివసించే ఈ జీవి కనిపించడం చాలా అరుదు. అయితే, ఈ చేప దర్శనం అరిష్టాలకు, ముఖ్యంగా భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు సంకేతమని కొన్ని దేశాల్లో బలంగా నమ్ముతారు. దీంతో, ఈ నెల ఆరంభంలో పట్టుబడిన ఈ 'ప్రళయ చేప' వార్త స్థానికులతో పాటు సోషల్ మీడియాలోనూ తీవ్ర భయాందోళనలకు దారితీసింది. శాస్త్రీయంగా రిగాలెకస్ గ్లెస్నే అని పిలువబడే ఈ ఓర్ ఫిష్ కనిపిస్తే భూమి త్వరలో కంపించవచ్చని, లేదా ఏదైనా పెద్ద విపత్తు సంభవించవచ్చని ఓ నమ్మకం ప్రచారంలో ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com