Maharashtra : రైల్లో వదంతి వ్యాప్తి.. ఘోర ప్రమాదం

X
By - Manikanta |22 Jan 2025 10:30 PM IST
మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో జలగావ్ జిల్లాలో పరండా రైల్వే స్టేషన్ సమీపంలో కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టడంతో పలువురు మృతి చెందారు. పుష్పక్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో మంటలు చెలరేగాయన్న వదంతులతో ప్రయాణికులు భయాందోళనలకు గురై చైన్ లాగి కిందికి దిగారు. పట్టాలు దాటుతున్న ఆ ప్రయాణికులను మరో ట్రాక్ వేగంగా దూసుకొచ్చిన కర్ణాటక ఎక్స్ ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పందించి, ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com