Russia : మాస్కో దాడిలో పెరుగుతున్న మృతులు

Russia : మాస్కో దాడిలో పెరుగుతున్న మృతులు

Russia : రష్యాలో టెర్రరిస్టుల దాడి ప్రపంచాన్ని వణికిస్తోంది. రష్యా రాజధాని మాస్కోలో టెర్రరిస్టులు దాడులకు తెగబడ్డారు. మాస్కోలో ఓ మ్యూజిక్‌ కన్సర్ట్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో అందులోకి ప్రవేశించి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ సంఘటనలో 60కి పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. తాజాగా అమెరికా ఓ కీలక ప్రకటన చేసింది.

క్రాకస్‌ సిటీ కాన్సర్ట్‌ హాల్‌లోకి కొందరు టెర్రరిస్టులు ప్రవేశించారు. తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. కనిపించిన వారిని కనిపించినట్లుగా కాల్చేసి మారణహోమం సృష్టించారు. ఆ తర్వాత గ్రనేడ్‌లు కూడా విసిరినట్లు తెలుస్తోంది. దాంతో.. బిల్డింగ్‌లో మంటలు అంటుకున్నాయి. జనాలకు ఎటూ వెళ్లే పరిస్థితి లేకుండా చేసి ఐసిస్‌ ఉగ్రవాదులు ఊచకోత కోశారు.

రష్యాలో మాస్కో టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడికి ప్లాన్ చేస్తున్నట్లు ముందే హెచ్చరించామని అమెరికా తెలిపింది. మార్చి నెల మొదట్లోనే అమెరికా గవర్నమెంట్‌కు ఉగ్రదాడికి సంబంధించిన సమాచారం అందినట్లు వైట్‌హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి ఆడ్రియెన్ వాట్సన్ చెప్పారు. ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో దాడులు చేయాలని ఐసిస్‌ ప్లాన్ చేసిందని తెలిపారు. డ్యూటీ టు వార్న్‌ పాలసీ కింద ఇదే విషయాన్ని రష్యా ప్రభుత్వానికి చెప్పామనీ..రష్యాలో ఉన్న అమెరికన్లకు అడ్వైజరీ కూడా జారీ చేసినట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story