Sunita Williams : మళ్లీ రోదసిలోకి వెళ్తా.. భారత్‌కు వస్తా : సునీతా విలియమ్స్

Sunita Williams : మళ్లీ రోదసిలోకి వెళ్తా.. భారత్‌కు వస్తా : సునీతా విలియమ్స్
X

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమికి చేరుకున్న కొన్ని రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు. దాదాపు తొమ్మిది నెలలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకు పోయిన వీరిద్దరు ఇటీవల భూమ్మీదకు వచ్చారు. ప్రస్తుతం నాసా అబ్జర్వేషన్ లో పునరావాసం పొందుతున్న వీరు నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రోదసిలో తమకు ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.

అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించింది? అన్న ప్రశ్నకు భారత సంతతి వ్యోమగామి సునీతా బదులిచ్చారు. 'భారత్ అద్భుతంగా కనిపించేది. తూర్పు నుంచి గుజరాత్, ముంబయి వంటి ప్రాంతాలవైపు వెళుతున్నప్పుడు పశ్చిమ తీరంలో నిలిపి ఉంచిన చేపల పడవలు మాకు సంకేతాలుగా పనిచేసేవి. అంటే భారత దేశానికి వచ్చామని గుర్తు చేసేవి. భారత్ ను చూస్తే పెద్ద నగరాల నుంచి లైట్ల నెట్ వర్క్ చిన్న నగరాలకు వెళుతున్నట్లు అనిపించేది. రాత్రి సమయాల్లో అలాగే పగటి పూట కూడా భారత్ అద్భుతంగా కనిపించేది. ఇక హిమాలయాలు అయితే అత్యద్భుతం. హిమాలయాల మీద నుంచి వెళ్లిన ప్రతీసారి ఆ మంచుకొండల అందాలను బుచ్ విల్మోర్ కెమేరాలో బంధించారు అని సునీతా విలియమ్స్ వివరించారు.

"నా తండ్రి జన్మించిన దేశానికి త్వరలోనే వెళ్లాలని అనుకుంటున్నాను. అక్కడి బంధువులు.. ప్రజలతో ముచ్చటించాలని, అంతరిక్షంలో నా అనుభవా లను వారితో పంచుకోవాలని ఉంది. భారత్ అద్భుతమైన ప్రజాస్వామ్య దేశం. తప్పకుండా భారత దేశానికి నా టీమ్ తో కలిసి వస్తా" అని చెప్పారు సునీత.

Tags

Next Story