Israel : ఇజ్రాయెల్ వైమానిక దాడి.. హమాస్లో 13 మంది మృతి

ఇజ్రాయెల్ ప్రతీకారం ఇంకా చల్లారలేదు. హమాస్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ మళ్లీ వైమానిక దాడులు చేసింది. దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ వైమానిక దాడిలో 13 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.
ఈజిప్ట్ ఆతిథ్యమిచ్చిన ఇజ్రాయెల్తో కాల్పుల విరమణకు సంబంధించి హమాస్ నాయకుల మధ్య చర్చలు జరగవచ్చనే వార్తలు వెలుగులోకి వస్తున్న సమయంలో ఈ బాంబు దాడి జరిగింది. కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు వెలుగులోకి వస్తున్న సమయంలో ఈ బాంబు దాడి జరిగింది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో రఫాలోని మూడు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఇజ్రాయెల్ బాంబు దాడి నుండి తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు రఫాలో ఆశ్రయం పొందుతున్నారు. గతేడాది అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు 34,000 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. 23 లక్షల మంది ప్రజలు ఆశ్రయం కోల్పోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com