US Embassy Officials : అతిత్వరలోనే యూఎస్ నుంచి మరికొందరి రాక

X
By - Manikanta |6 Feb 2025 5:15 PM IST
అమెరికా నుంచి భారత్ కు విమానంలో 205 మంది భారతీయులు వస్తున్నట్లు వార్తలొచ్చాయి. కానీ, 104 మంది మాత్రమే స్వదేశం చేరుకున్నారు. వలసదారుల సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. రానున్న రోజుల్లో ఇలాంటి విమానాలు మరిన్ని భారత్ కు రానున్నాయని అమెరికా ఎంబసీ అధికారులు తెలిపారు. అమెరికా హోంలాండ్ అధికారుల గణాంకాల ప్రకారం, 20,407 మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లు తేలింది. వీరిలో 17,940 మందిని వెనక్కి పంపేందుకు తుది ఉత్తర్వులు జారీచేశారు. 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పంజాబ్ కు చెందిన వారిలో అనేకమంది డంకీ మార్గాలతోపాటు లక్షలాది రూపాయలు ఖర్చుచేసి అమెరికాలో అక్రమంగా ప్రవేశించినట్లు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com