Vietnam : వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి

Vietnam : వియత్నాంలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి
X

వియత్నాంలోని కాన్ఫో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని కొమరంభీం ఆసిఫా బాద్ జిల్లాకు చెందిన అర్షిద్ అశ్రిత్గా గుర్తించారు. అర్షిద్ అక్కడ ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. వైగంగా బైకు నడపడంతో, అది అదుపుతప్పి గోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడి స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్ వేగంగా వెళుతుందని, అదుపుతప్పి నేరుగా గోడను ఢీకొనడంతో ఇద్దరూ పైకి ఎగిరిపడిన దృశ్యాలు దగ్గరలోని సిసిటివి కెమెరా లో రికార్డయ్యాయి. రోడ్డుపై వేగంగా వచ్చిన ఓ బైకు వేగంగా దూసు కెళ్ళి గోడను ఢీ కొట్టింది, దాంతో అర్షిద్ అతని మిత్రుడు ఇద్దరూ గాల్లోకి ఎగిరినట్లు వీడియో ఫుటేజీలో కనిపించింది.

మృతుడి తల్లిదండ్రులు అర్జున్, ప్రతిమలు ఆసిఫాబాద్ లో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నారు. వారి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాదకర సంఘటనపై స్థాని క ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు స్పందించారు. మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంతాపం తెలియజేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి మృతదేహాన్ని ఇండియాకు రప్పించే ప్రక్రియ వేగంగా జరపాలని విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story