Tragic Accident : ఘోరం.. బ్రిడ్జిపై నుంచి పడిన బస్సు.. దాదాపు అందరూ మృతి

Tragic Accident : ఘోరం.. బ్రిడ్జిపై నుంచి పడిన బస్సు.. దాదాపు అందరూ మృతి

African Country : ఆఫ్రికన్ దేశం మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి బస్సు కింద ఎండిన వాగులోకి పడిపోయింది. కెనిబా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 31 మందికి పైగా మరణించగా, 10 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ట్రాఫిక్ మరణాలలో దాదాపు నాలుగింట ఒక వంతు ఆఫ్రికాలోనే జరుగుతున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 27) మాలిలో 31 మంది మరణించారని, మరో 10 మంది గాయపడ్డారని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. బుర్కినా ఫాసో వైపు వెళ్తున్న బస్సు ఆగ్నేయ ప్రాంతంలో ఉన్న వంతెనపై నుంచి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బాగో నదిని దాటే వంతెనపై సాయంత్రం 5 గంటలకు ప్రమాదం జరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని మంత్రిత్వ శాఖ తెలిపింది. మాలిలో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోవడం గమనార్హం. దేశంలోని అనేక రహదారులు, వాహనాల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. ఈ నెల ప్రారంభంలో సెంట్రల్ మాలిలో రాజధాని బమాకోకు వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో 15 మంది మరణించారు. 46 మంది గాయపడ్డారు. రెండు వాహనాలు ఎదురుగా వెళ్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story