Kuwait Fire Incident : కువైట్లో ఘోర అగ్నిప్రమాదం.. 41మంది ఆహుతి

కువైట్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంగాఫ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 41మంది సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఐదుగురు కేరళకు చెందిన వారు ఉన్నట్లుగా గుర్తించారు. మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఓ కంపెనీకి చెందిన 6 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 160 మంది అందులో ఉన్నారు. కిచెన్ లో చెలరేగిన మంటలు విస్తరించాయి. కంపెనీలో పని చేసే కార్మికులే మృతుల్లో ఎక్కువగా ఉన్నారు. అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు 5వ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశారు. కిందకు దూకినవారంతా చనిపోయారు.
హాస్పిటళ్లలో 50మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారిలో ఎక్కువమంది ఊపిరాడక చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై అధికారులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం కల్పించాలని అధికారులు ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com