Operation Sindhur : ఆపరేషన్ సిందూర్ పై పాకిస్థాన్ రహస్య పత్రాల్లో ఏం చెప్పిందంటే?

Operation Sindhur : ఆపరేషన్ సిందూర్ పై పాకిస్థాన్ రహస్య పత్రాల్లో ఏం చెప్పిందంటే?
X

ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార దాడులు ప్రపంచవ్యాప్తంగా ఓ సంచలనం. ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ సహా పలు కీలక ప్రాంతాల్లోని సైనిక, వైమానిక స్థావరాలు.. దాదాపు పది చోట్ల క్షిపణులతో విధ్వంసం సృష్టించినట్లు భారత్ స్వయంగా ప్రకటించింది. రోజులు గడుస్తున్నకొద్దీ పాకిస్తాన్ కూడా తనకు జరిగిన నష్టాన్ని ఒప్పుకుంటోంది. అయితే, భారత్ దాడుల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, దేశంలోని సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను దెబ్బతీసిందని పాకిస్తాన్ ఇప్పుడు లోలోపల రగిలిపోతోంది. ఆ విషయాన్ని బహిరంగం గా చెప్పుకోలేకపోతోంది. తన వైఫల్యాన్ని బయటపెట్టలేక పోతోంది. భారత్-పాక్ లు ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ.. మరో ఏడు ప్రాంతాల్లో భారత్ గట్టి దెబ్బ తీసినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం రహస్య పత్రాల్లో పేర్కొన్నట్లు తెలిసింది.

ఆ డాక్యుమెంట్ల ప్రకారం పెషావర్, అత్తోక్, గుజ్రాత్ ఝాంగ్, బహవాలనగర్, హైదరాబాద్ (పాకిస్తాన్), ఛోర్లలో కూడా భారత్ దాడులు చేసింది. వీటిలో పెషావర్, అశోక్ వంటి ప్రాంతాలు నియంత్రణ రేఖకు సుమారు 700 నుంచి 1000 కి.మి. దూరంలో ఉన్నాయి. అంటే పాకిస్తాన్ నలుమూల స్థావరాలపై భారత్ గురిపెట్టినట్లు తేలింది. అయితే, పాకిస్తాన్ ఈ విషయాన్ని బహిరంగపరచడం లేదు. పైగా భారత్ జనావాసాలపై దాడి చేసినట్లు బుకాయిస్తోంది. ఇదే విషయాన్ని ప్రపంచ దేశాలకు చెబుతూ భారత్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ విషయాలు, ఆరోపణలను మాత్రం ఆ రహస్య పత్రాల్లో చెప్పలేదు. ఈ పత్రాల్లో పేర్కొన్న ఆ కొత్త ఏడు ప్రాంతాలు సైనిక స్థావరాలా? జనావాస ప్రాంతాలా అన్న విషయాన్ని ప్రస్తావించలేదు. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై దాడికి సంబంధించి భారత్ ప్రకటిస్తూ.. జనావాసాలకు, ప్రజలకు, వారి ఆస్తులకు ఎటువంటి నష్టం కలగని రీతిలో ఆ దేశంలోని బహుళ లక్ష్యాలను ఛేదించినట్లు వెల్లడించింది.

Tags

Next Story