AP BJP: జగన్‌ పాలనలో అడ్డగోలుగా ఇసుక దందా

AP BJP: జగన్‌ పాలనలో అడ్డగోలుగా ఇసుక దందా
బురిలంక రేవు వద్ద ఇసుక తవ్వకాలు పరిశీలించిన పురందేశ్వరి.... ఆక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో అడ్డగోలుగా ఇసుక దందా సాగుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం బురిలంక రేవు వద్ద ఇసుక తవ్వకాలను బీజేపీ, జనసేన నేతలతో కలిసి ఆమె పరిశీలించారు. ఏపీలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతోందని పురందేశ్వరి ఆరోపించారు. గోదావరి రేవులో అనుమతి లేకుండానే వేలాది లారీలతో ఇసుక తరలిస్తున్నారని ఆమె మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ ఇసుక దందాను అడ్డుకోకుంటే జనసేనతో కలిసి ఆందోళన చేపడతామని పురందేశ్వరి హెచ్చరించారు. ఆంధ్రాలో ఇసుక సరఫరా దోచుకో దాచుకో అన్న చందాన జరుగుతోందని మండిపడ్డారు. జేపీ సంస్థ ముసుగులో అడ్డగోలుగా ఇసుక దందా సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక దోపిడీలో వచ్చే సొమ్మంతా తాడేపల్లికే వెళ్తోందన్నారు.


బుర్ర లంకలో ఇసుక ర్యాంపుల్లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని ప్రశ్నిస్తే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని పురందేశ్వరి మండిపడ్డారు. అక్రమ తవ్వకాల కోసం న కిలోమీటర్ల మేర వాహనాల క్యూ నాలుగు ఐదు కిలో మీటర్ల మేర లారీలు క్యూ లైన్‌లో ప్రమాదకరంగా ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ ఆగడాలకు కడియం నర్సరీ రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పర్యావరణ నిబంధనల ప్రకారం మిషనరీతో తవ్వకాలు జరుగుతున్నాయని.. దీనివల్ల ధవళేశ్వరం బ్యారేజ్ తో పాటు పర్యావరణానికి ముప్పు ఉందన్నారు. కంపెనీ పేరు లేకుండా బిల్స్ ఉన్నాయని, ఢిల్లీలో ఉన్న వారి పేరుతో ఇక్కడ తవ్వకాలు ఇల్లీగల్ గా జరుగుతున్నాయని ఆరోపించారు.

పొలాలకు కూడా వెళ్లనీయకుండా ఇసుక మాఫియా బెదిరింపులకు పాల్పడుతోందని నర్సరీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నర్సరీ రైతులు ఇసుక అక్రమాలను ఇరు పార్టీల నేతలకు వివరించారు. దశాబ్దాలుగా ఇలాంటి ఇసుక దందా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైనా చెప్తే చంపేస్తాం, కాల్చిపారేస్తాం అనేలా బెదిరిస్తున్నారని వాపోయారు. దశాబ్దాలుగా ఇలాంటి ఇసుక దందా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికైనా చెప్తే చంపేస్తాం, కాల్చిపారేస్తాం అనేలా బెదిరిస్తున్నారని వాపోయారు. ఆంధ్రాలో ఇసుక సరఫరా దోచుకో దాచుకో అన్న చందాన జరుగుతోందని మండిపడ్డారు. జేపీ సంస్థ ముసుగులో అడ్డగోలుగా ఇసుక దందా సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దోపిడీలో వచ్చే సొమ్మంతా తాడేపల్లికే వెళ్తోందన్నారు. నేటికీ ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతుండడం వైసీపీ ప్రభుత్వ దోపిడీకి అద్దం పడుతోందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story