Breaking : మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా

Breaking : మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా

AP : ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma) తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపిన ఆమె.. కాసేపట్లో రాజీనామాపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో తనకు లేదా భర్తకు టికెట్ ఇవ్వాలని గతంలోనే ఆమె సీఎంను కోరారు. జగ్గయ్యపేట, నందిగామ, రాజమండ్రి నుంచి పోటీకి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

జగన్‌కు అత్యంత నమ్మకమైన వైసీపీ నేతల్లో వాసిరెడ్డి పద్మ ఒకరు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెను మహిళా కమిషన్ చైర్‌పర్శన్‌గా చేశారు. వాసిరెడ్డి పద్మ 2019, ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. అప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న నన్నపనేని రాజకుమారి రాజీనామా చేయడంతో.. అధికార వైసీపీ వాసిరెడ్డి పద్మను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమిస్తూ జీఓ విడుదల చేసింది. అంతకుముందు ఆమె వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.

వాసిరెడ్డి పద్మ 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చింది. ఆమె ప్రజారాజ్యం పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేసింది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడంతో ఆమె 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా పనిచేసింది.

Tags

Read MoreRead Less
Next Story