Chiranjeevi : చిరంజీవిపై మాటల దాడితో వైసీపీ తప్పిదం చేసిందా..?

Chiranjeevi : చిరంజీవిపై మాటల దాడితో వైసీపీ తప్పిదం చేసిందా..?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఐతే.. తన తమ్ముడు పవన్ కు మాత్రం మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. దీంతో.. వైసీపీ చిరంజీవిలో మాటల దాడి చేసింది. ఇది తీవ్ర విమర్శల పాలవుతోంది.

చిరంజీవి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటించడాన్ని సజ్జల రామకృష్ణా రెడ్డి, పేర్ని నాని తీవ్రంగా వ్యతిరేకించారు. అటు వైసీపీ నేతలు కూడా చిరంజీవిపై విమర్శల డోసు పెంచుతున్నారు.

జనసేన పార్టీకి రూ. ఐదు కోట్ల విరాళం ఇచ్చి చిరంజీవి తన మొదటి స్టెప్ లో మద్దతు ప్రకటించారు. ఎన్డీయే అభ్యర్థులు గెలవాలని ఆకాంక్షించి తన పూర్తి మద్దతు ప్రకటించారు. ఐతే.. పవన్ తోపాటు.. ఇప్పుడు చిరంజీవివైనా ఇలా వైసీపీ దాడి చేయడంతో మెగా ఫ్యాన్స్, మూవీలవర్స్ నుంచి వ్యతిరేకత వస్తున్నట్టు సమాచారం. దీనిని టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రసంగంలో ప్రస్తావిస్తున్నారు. చిరంజీవి ఏం తప్పుచేశారని వైసీపీ విమర్శిస్తోందని చంద్రబాబు ప్రశ్నించారు. ఆస్కార్ విన్నర్స్ రాజమౌళి, మెగా హీరో చిరంజీవిలను జగన్ తన ఇంటికి పిలిపించుకుని అవమానించారని చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు విసుర్లు ట్రెండింగ్ లో ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story