AP : చెల్లెళ్లు షర్మిల, సునీతపై జగన్ సంచలన వ్యాఖ్యలు
తనకు రాజకీయ శత్రువులుగా మారిన తన తోబుట్టువు వైఎస్ షర్మిల, మరో చెల్లెలు సునీతపై సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేస్తున్న సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తన నామినేషన్ కు ముందు పబ్లిక్ ను ఉద్దేశించి ఓ సభలో మాట్లాడారు జగన్.
నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసులం అంటూ వస్తున్న వారి కుట్రలు చూస్తున్నామని జగన్ అన్నారు. పరోక్షంగా షర్మిలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం. ఆ మహానేతకు ఎవరు వారసులనేది చెప్పాల్సింది ప్రజలు కాదా అన్నారు. వైఎస్ ఆర్ చనిపోయాక ఆయన కుంటుంబం మీద కుట్రలు చేసింది ఎవరు అని జగన్ ప్రశ్నించారు. వైఎస్ఆర్ అనే పేరు లేకుండా చేయాలని కోరుకుంటున్నది ఎవరో జనం తెలుసుకోవాలన్నారు.
కొందరు.. వైసీపీ శత్రువులతో కలిసి పోయి.. వారి పార్టీలో చేరిపోయిన వాళ్లు వైఎస్ఆర్ కు వారసులు ఎలా అవుతారంటూ కౌంటరిచ్చారు జగన్. పసుపు చీర కట్టుకుని వారి ఇళ్లకు వెళ్లి.. వారి కుట్రలో భాగమవుతున్న వీళ్లా వైఎస్ఆర్ వారసులు అని మండిపడ్డారు. జగన్ కామెంట్స్ సంచలనంగా మారాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com