AP : కోడికత్తి శ్రీను పొలిటికల్ ఎంట్రీ .. అమలాపురం నుంచి పోటీ
సీఎం జగన్పై (CM Jagan) హత్యాయత్నం కేసులో నిందితుడైన కోడికత్తి శ్రీను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. జైభీమ్ భారత్ పార్టీలో చేరారు. సోమవారం రాత్రి విజయవాడలోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు జడ శ్రవణ్కుమార్ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. అమలాపురం నియోజకవర్గం నుంచి కోడికత్తి శ్రీను పోటీ చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ తాను పేదల కోసమే రాజకీయాల్లోకి రావాలనుకున్నట్టు చెప్పారు. కులం కోసమో, మతం కోసం తాను ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి వివేకారెడ్డి హత్య కేసులో అప్రువర్గా మారిన దస్తగిరి పార్టీలో చేరారు. పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి పై జై భీం రావు భారత్ పార్టీ తరపున సీఎం జగన్పై దస్తగిరి పోటీ చేయనున్నారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com