కృష్ణా జిల్లా పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా..!
By - TV5 Digital Team |13 Feb 2021 3:39 PM GMT
కృష్ణా జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగింది. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ బలపర్చిన అభ్యర్థి దుర్గా శ్రీనివాసరావు విజయం సాధించారు.
కృష్ణా జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగింది. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో టీడీపీ బలపర్చిన అభ్యర్థి దుర్గా శ్రీనివాసరావు విజయం సాధించారు. ముసకకవలపూడిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి శ్యామలత, జువ్వనపూడిలో నెలపాల పెరేసు, నత్తగుల్లపాడులో రాంబాబు గెలుపొందారు. వానపాములలో పోతూరి రమేశ్, అనమనపూడిలో టీడీపీ సీతామహాలక్ష్మి, పురిపాడులో కాగిత నరేంద్ర టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. దగ్గుమిల్లిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com