Pawan Kalyan : సన్నని బ్లేడ్లతో కోస్తున్నారన్న పవన్.. సెక్యూరిటీ టైట్

Pawan Kalyan : సన్నని బ్లేడ్లతో కోస్తున్నారన్న పవన్.. సెక్యూరిటీ టైట్

ఫొటోల పేరుతో వచ్చి సన్నని బ్లేడ్లతో తనపై దాడి చేస్తున్నారని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చెప్పడం సంచలనంగా మారింది. తనను హత్య చేసేందుకు సుఫారీ సైతం ఇచ్చారని గతంలో ఆరోపణలు చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఇప్పుడు పిఠాపురం ఎన్నికల ప్రచార సభలో పవన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఎలాగైనా గెలుపొందేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇక్కడ కానీ తాను ఓటమి పాలైతే తనను రాజకీయ సమాధి చేస్తారని పవన్ కు తెలుసు. అందుకే పిఠాపురంలో రెండు లక్షల ఓటర్లను నేరుగా కలిసేందుకు డిసైడ్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ కు ఉన్న విపరీతమైన స్టార్ డమ్ అడ్డంకిగా నిలుస్తోంది. జనం ఎక్కువమంది గుమిగూడినప్పుడు కిరాయి మూకలు జొరబడి సన్నని బ్లేడ్లతో కోసి గాయపరుస్తున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.అయితే సోషల్ మీడియాలో వైసిపి రచ్చ చూసినవారు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందని భావిస్తున్నారు.

అయితే పవన్ ఈ తరహా ఆరోపణలు చేయడం కొత్త కాదు. 2019 ఎన్నికలకు ముందు కూడా ఇదే రీతిలో తనకు ప్రాణ హాని తలపెట్టడానికి ప్రయత్నించారని… మొన్నటికి మొన్న వారాహి యాత్రలో చెప్పుకొచ్చారు.అయితే ఇవి ఆరోపణల వరకే పరిమితం చేశారు. రుజువు చేసే ప్రయత్నం చేయలేదు. రాజకీయ విభేదాలు ఉంటాయి కానీ.. ప్రత్యర్థి పై వ్యక్తిగత దాడికి పురిగొల్పడానికి ఎవరు సాహసించరు. అందునా విపరీతమైన అభిమానులు ఉన్న పవన్ కళ్యాణ్ జోలికి వచ్చేందుకు ఎవరు ముందుకు రారు. నాయకుల అభిమానం మాటున అల్లరి మూకలు ఈ తరహా ప్రయత్నం చేయవచ్చు. కానీ దీని వెనుక రాజకీయ పార్టీల ప్రోత్సాహం ఉందని మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయం.

Tags

Read MoreRead Less
Next Story