Weather : ఉరుములు, మెరుపులతో వాన.. రెండు రోజులు కాస్త రిలాక్స్

Weather : ఉరుములు, మెరుపులతో వాన.. రెండు రోజులు కాస్త రిలాక్స్

మండుతున్న ఎండలు, ఎండిపోయిన పంటపొలాలు, ఇంకిపోయిన బోర్లతో ఇబ్బందిపడుతున్న జనాలకు కొంత రిలీఫ్ నిచ్చేవార్త ఇచ్చే. తెలంగాణలో (Telangana) మండుటెండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. బుధవారం పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి.

వచ్చే ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌ (AP), యానాంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐఎండీ యొక్క అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. నేడు ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ , యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ , రాయలసీమలోని వివిక్త ప్రాంతాలలో వేడి, తేమ,అసౌకర్య వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. ఏప్రిల్ 12 నుండి, ఇదే ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.

ఈ తుఫాను పరిస్థితులు ఏప్రిల్ 12 నుండి 14 వరకు తదుపరి మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా. గత రెండు రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల సెల్సియస్‌ తగ్గుముఖం పట్టగా, రాయలసీమ జిల్లాల్లో ఉక్కపోత కొనసాగుతోంది. మరోవైపు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో అత్యధికంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత, అనంతపురంలో అత్యధికంగా 40.3 డిగ్రీల సెల్సియస్‌, నంద్యాలలో 40 డిగ్రీల సెల్సియస్‌ నమోదు అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story