CBN: ఇదీ రాక్షసులతో యుద్ధం... సంకల్పంతో సాగండి

CBN: ఇదీ రాక్షసులతో యుద్ధం... సంకల్పంతో సాగండి
తెలుగుదేశం అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్దేశం.... ప్రతి ఒక్కరూ గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టాలని సూచన

ఉండవల్లిలోని నివాసంలో పార్లమెంట్, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు చంద్రబాబు బీఫాంలు అందించారు. అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. బీఫాంలు తీసుకున్న ప్రతి ఒక్కరూ గెలిచి...చట్టసభల్లో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు. ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులు ఎంపిక జరిగిందన్నారు. రాక్షసులతో యుద్ధం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పుకోలేకే. డ్రామాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. పెన్షన్ల విషయంలో జగన్ చేసిన కుట్రలు, ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు ఛీ కొట్టారని దుయ్యబట్టారు. ప్రజాగళానికి వస్తున్న స్పందనే.... జగన్ పతనాన్నిచాటిచెప్తోందని ధీమా వ్యక్తం చేశారు.


ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్న ఆయన...ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలవాలన్నదే తమ నినాదమని తేల్చిచెప్పారు. 3 పార్టీల నేతల మధ్య సమన్వయం ఉంటూనే.. ఓటు బదిలీ జరగాలని దిశానిర్దేశం చేశారు. వైకాపాలో సీటు ఇస్తానన్నా తీసుకోకుండా.. బయటకు వచ్చిన మంచివాళ్లకే సీట్లు ఇచ్చానని స్పష్టం చేశారు. ఎన్నికలకు 22 రోజులు.. ప్రచారానికి 20 రోజులే మిగిలి ఉందని గుర్తుచేసిన చంద్రబాబు... సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ.... ముందుకు సాగాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు.


లేనిది ఉన్నట్లు...ఉన్నది లేనట్లు చెప్పడంలో జగన్ నేర్పరని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రతిసారీ సానుభూతితో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 43 వేల కోట్లు అక్రమంగా సంపాదించారని సీబీఐ నిర్ధారిస్తే......దాన్ని నిరూపించుకోకుండా తనపై అక్రమ కేసులు పెట్టారని ప్రచారం చేసుకున్నాడని దుయ్యబట్టారు. జగన్ బస్సుయాత్రలో వాళ్లే కరెంట్ తీసేసుకున్నారన్న చంద్రబాబు...చీకట్లో తాను దాడి చేయించానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ప్లకార్డులు పట్టుకుని వచ్చి ధర్నాలు చేశారని విమర్శించారు. రాయి విసిరిన వ్యక్తితో... బొండా ఉమా ప్రమేయం ఉందని చెప్పించేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్ల పంపిణీకి నిధుల్లేకుండా చేసి...వాలంటీర్లతో పంపిణీ చేయొద్దనడంతోనే పెన్షన్లు ఆగిపోయాయని విష ప్రచారం చేశారని ఆరోపించారు. అమరావతి, పోలవరంను విధ్వంసం చేసిన జగన్‌...రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. కేడర్ తో ప్రతి అభ్యర్థీ అనుసంధానం కావాలని చంద్రబాబు సూచించారు. అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. మళ్లీ రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. బీ -ఫాంలు అందుకున్న అభ్యర్థులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story