AP : ఏపీలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు
By - Manikanta |12 April 2024 4:30 AM GMT
ఏపీలో (AP) అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే నెలలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గడిచిన పదేళ్లలో 2016 ఏప్రిల్ 25న తిరుపతిలో 45.7 డిగ్రీలు నమోదవగా, ఆదివారం మార్కాపురం (46°C) దానిని అధిగమించింది. ఐఎండీ గణాంకాల ప్రకారం 2003 మే28న రెంటచింతలలో 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యధికం.
మరోవైపు రాష్ట్రంలోని 62 మండలాల్లో ఇవాళ వడగాలులు వీస్తాయని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్రవడగాల్పులు వీస్తాయని, రేపు 33 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com