AP : కడపలో మేనత్త విమలా రెడ్డి ఎంట్రీ.. షర్మిల దిమ్మతిరిగే కౌంటర్

AP : కడపలో మేనత్త విమలా రెడ్డి ఎంట్రీ.. షర్మిల దిమ్మతిరిగే కౌంటర్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వైఎస్ కుటుంబం మధ్య యుద్ధంలా కొనసాగుతున్నాయి. వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయిలో జరుగుతోంది. జగన్ కు, అవినాశ్ కు సపోర్ట్ గా జగన్, షర్మిల మేనత్త వైఎస్ విమలా రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. వైఎస్ వివేకా హత్య విషయమై మేనత్త విమలారెడ్డి, షర్మిలా రెడ్డి పరస్పర విమర్శలు చేసుకున్నారు.ప్రశాంతంగా ఉన్న పులివెందులలో షర్మిల, సునీత అల్లర్లు రేపుతున్నారని.. ఇకనైనా నోరు మూస్కోండని విమలా రెడ్డి అన్నారు.

అవినాశ్ ఎదుగుదలను షర్మిల, సునీత ఓర్చుకోలేకపోతున్నారని విమలా రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. షర్మిలకు నాయకత్వ లక్షణాలు లేవని.. షర్మిల, సునీత వల్ల కుటుంబంలో అందరూ ఏడుస్తున్నారనీ.. కుటుంబ పరువును రోడ్డుకు ఈడుస్తున్నారని.. వివేకాను ఎవరు చంపారో వీళ్లే డిసైడ్ చేస్తున్నారని విమల మండిపడ్డారు.

మేనత్త విమలా రెడ్డి వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. "విమలమ్మ మాకు మేనత్త. విమలమ్మ కొడుక్కి జగన్ వర్క్స్ ఇచ్చారు. ఆర్థికంగా బల పడ్డారు. అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు. ఇక్కడ చనిపోయింది తన సొంత ఆన్న అని విమలమ్మ తెలుసుకోవాలి. వివేకా ఎంత చేశారో విమలమ్మ మరిచి పోయింది. మేం ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. వివేకా హత్య విషయంలో CBI చూపించిన ఆధారాలు మాత్రమే ఎత్తి చూపిస్తున్నాం. ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసింది.. మేము మాట్లాడుతున్నాం. హత్యా రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నాం. హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నాం. విమలమ్మకి వయసు మీద పడింది. ఎండా కాలం కదా.. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతోంది." అని ఘాటుగా కౌంటరిచ్చారు షర్మిల.

Tags

Read MoreRead Less
Next Story