Jayasudha : జయసుధ రూ.వంద కోట్ల ప్రాపర్టీ సేల్.. కారణం ఇదే!

Jayasudha : జయసుధ రూ.వంద కోట్ల ప్రాపర్టీ సేల్.. కారణం ఇదే!

సినిమాల్లోనూ, రాజకీయాల్లోనూ సక్సెస్ అయిన నటి జయసుధ (Jaya Sudha). రెండు కెరీర్స్ లో టాప్ లో ఉన్నప్పుడే ఇటు హైదరాబాద్ లోనూ.. అటు చెన్నైలోనూ భూములు కొని భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకున్నవారిలో జయసుధ కూడా ఒకరు. ఐతే..మారిన రాజకీయ పరిస్థితుల్లో జయసుధ పొలిటికల్ గా కెరీర్ ను బిల్డ్ చేసుకోలేకపోయారు. సినిమా ఫేమ్ తో పాటు.. పొలిటికల్ గా ఓ ఉన్నతస్థాయికి చేరుకున్న చాలామంది జయసుధ లాగే వెనుకబడి పోయారు. తెలంగాణ ఉద్యమం లాంటి విభిన్నమైన రాజకీయ పరిణామాలు ఓ కారణమై ఉండొచ్చు.

ప్రస్తుత కాలంలో బిజినెస్‌లకు కొదవ లేదు. ఎన్నో రకాల బిజినెస్ లతో సెలబ్రిటీస్ బిజీ బిజీ అవుతూనే ఉన్నారు. ఓ పక్కన సినిమాల్లో నటిస్తూనే బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ అప్పట్లో ఎవరైనా డబ్బులు ఉంటే స్థలాలు, పొలాల పైనే ఇన్వెస్ట్ చేసేవారు. అలా చెన్నైలో శోభన్ బాబు కొన్న కొన్ని స్థలాలు ఇప్పుడు ఎన్నో కోట్ల విలువ చేస్తున్నాయి. ఇక అలా అప్పట్లో చెన్నైలో ఆస్తులు కొన్న వారిలో నటి జయసుధ ఒకరు. సహజనటిగా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ సీనియర్ నటి.. తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ బిజీగా కెరీర్ కొనసాగిస్తోంది. ఐతే.. ఆర్థిక పరమైన కష్టాలు మాత్రం వెంటాడుతున్నట్టు చెబుతున్నారు.

ఓ ఇంటర్వ్యూలో జయసుధ ఈ విషయాలు పంచుకున్నారు. "నా ఆస్తుల గురించి చెప్పాలంటే నేను చెన్నైలో అప్పట్లో ఓ బిల్డింగ్ కొన్నాను. అది విని శోభన్ బాబు గారు చాలా మంచి పని చేశావు అంటూ ప్రశంసించారు. ఆ తర్వాత దాన్ని అమ్మేయాల్సిన సమయం వచ్చింది. అదే కాకుండా ఓ తొమ్మిది ఎకరాల స్థలాన్ని కూడా కొన్న. ఆ స్థలంలో బోర్ వేస్తే పడకపోవడంతో దాన్ని కూడా అమ్మేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ స్థలం విలువ దాదాపు రూ.100 కోట్లు ఉంటుంది. ఆస్తులు వెనకేసుకోవడానికి కూడా అదృష్టం ఉండాలి" అంటూ ఆమె వివరించింది. జయసుధ చెప్పిన కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి. వంద కోట్ల ప్రాపర్టీ గతంలో మనదై ఉండి.. ఇప్పుడు కాకపోతే ఆ బాధ మాటల్లో చెప్పలేం.

Tags

Read MoreRead Less
Next Story