Tollywood : టాలీవుడ్ వెలుగుతున్న వేళ.. గ్రాండ్‌గా దాసరి జయంతి

Tollywood : టాలీవుడ్ వెలుగుతున్న వేళ.. గ్రాండ్‌గా దాసరి జయంతి

దర్శకరత్న దాసరి నారాయణ రావు జయంతి మే 4న వస్తోంది. దీనిని దర్శకుల దినోత్సవంగా జరుపుకుంటోంది తెలుగు ఇండస్ట్రీ. హీరోల చట్రంలో ఇరుక్కుపోయిన తెలుగు పరిశ్రమలో దర్శకుడికి క్రెడిట్ దక్కేలా చేసిన కొద్దిమంది దర్శకుల్లో దాసరి ప్రథముడు. డైరెక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనేది ఆయన చెప్పిన మాటే.

ఇపుడు తెలుగు సినిమా దేశాన్ని ఏలుతోంది. డైరెక్టర్లకు హీరోలను మించిన ఇమేజ్ సొంతమైంది. దీంతో.. దాసరి జయంతిని ఘనంగా జరిపేందుకు సిద్ధమయ్యారు తెలుగు సినీ ప్రముఖులు. మే 4న హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించాలనుకుంటోంది టాలీవుడ్.

టాలీవుడ్ ప్రముఖులంతా వస్తారని చెబుతున్నారు. రాజమౌళి, సుకుమార్‌, త్రివిక్రమ్‌ దర్శక దిగ్గజాలు హాజరవుతారని అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ తన వంతుగా రూ.35 లక్షలు విరాళంగా ప్రకటించాడు.

Tags

Read MoreRead Less
Next Story