AP : కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు మృతి

AP : కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం..  నలుగురు మృతి

Kakinada : కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున నలుగురి పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే చనిపోయారు. . అన్నవరం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్‌ కావడంతో రహదారి పక్కనే నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు. విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు.. లారీ మరమ్మతులు చేస్తున్న సిబ్బంది ముగ్గురితో పాటు అదే మార్గంలో అటువైపుగా వస్తున్న మరో వ్యక్తిపైకి దూసుకెళ్లింది.

దీంతో వారంతా స్పాట్ లోనే చనిపోయారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సును ఆపకుండా డ్రైవర్ రాజమహేంద్రవరం వైపు తీసుకెళ్లాడు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును వెంబండించి పట్టుకున్నారు. మృతులు దాసరి ప్రసాదు, దాసరి కిషోర్, క్లీనర్ నాగయ్య, స్థానికుడు రాజుగా పోలీసులు గుర్తించారు.

మృతి చెందిన వారిది బాపట్ల జిల్లా నక్క బొక్కలపాలెం కాగా.. రాజు అనే యువకుడిది ప్రత్తిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు. ఆర్టీసీ బస్సు అదుపుతప్పడం వల్ల ప్రమాదం జరిగిందా లేదా డ్రైవర్ నిద్ర మత్తు ఈ ఘటనకు కారణమా అనే దానిపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story