Crime : భార్యను తన్నబోయి.. జారిపడి భర్త మృతి

Crime : భార్యను తన్నబోయి.. జారిపడి భర్త మృతి

భార్యతో గొడవపడిన ఓ భర్త తాగిన మైకంలో ఆమెను తన్నబోయి జారి పడి చనిపోయాడు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్​నగర్​ మండలం కనికి గ్రామపంచాయతీ పరిధిలోని ఎడ్లగూడకు చెందిన కట్టెకోళ్ల శంకర్ (36 ) తాగుడుకు బానిసయ్యాడు. శంకర్​ తన భూమిని కౌలుకు ఇవ్వగా ఈనెల 2న కౌలుకు తీసుకున్నవారు రూ. 36 వేలు ఇచ్చారు. సోమవారం బాగా తాగిన శంకర్​ బీరువాలో ఉన్న కౌలు డబ్బులు తీస్తుండగా గమనించిన అతడి భార్య కవిత అడ్డుకునే ప్రయత్నం చేసింది.

మత్తులో ఉన్న శంకర్​ తననే అడ్డుకుంటావా అంటూ ఆమెను కాలితో తన్నేందుకు వెళ్లాడు. కవిత తప్పించుకోగా శంకర్​ కాలు జారి గడప మీద పడ్డాడు. తల వెనుకవైపు బలమైన గాయం కావడంతో రక్తస్రావమైంది. కుటుంబసభ్యులు అతడిని కౌటాల పీహెచ్ సీకి, అక్కడ నుంచి కాగజ్​నగర్​లోని ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించారు.

అప్పటికే శంకర్​ చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. మృతుడి తల్లి రాంబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ మధుకర్ తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐ సాదిక్ పాషా పరిశీలించారు.

Tags

Read MoreRead Less
Next Story