Draksharamam : ఏప్రిల్‌ 24 నుంచి ద్రాక్షారామ గర్భాలయాలు మూసివేత

Draksharamam : ఏప్రిల్‌ 24 నుంచి ద్రాక్షారామ గర్భాలయాలు మూసివేత

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామలో భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ అమ్మవారి గర్భాలయాలను ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు మూసివేస్తున్నట్టు ఈవో పీటీవీ సత్యనారాయణ తెలిపారు. స్వామివారి మూలవిరాట్‌ (శివలింగం)కు రసాయన రక్షణ చర్యలు, అమ్మవారి గర్భాలయంలో అభివృద్ధి పనులను కేంద్ర పురావస్తు శాఖ చేపట్టనుండటంతో దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు గర్భాలయాలను మూసివేస్తామన్నారు. 24వ తేదీన ప్రాతఃకాలార్చన అనంతరం శృంగేరీ పీఠాధిపతులు అందజేసిన బాణలింగాన్ని ఉదయం 10.39 గంటలకు నంది మండపంలో ప్రతిష్ఠిస్తామన్నారు. నిత్యం జరిగే ప్రథమాభిషేకం, ఆర్జితసేవలతో పాటు ఉదయం 10 గంటలకు అభిషేకం నిర్వహిస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story