Lord Krishna: శ్రీకృష్ణుడి మరణానికి కారణం ఎవరు..? అంత్యక్రియలు ఎవరు, ఎక్కడ జరిపించారు.?

Lord Krishna: శ్రీకృష్ణుడి మరణానికి కారణం ఎవరు..? అంత్యక్రియలు ఎవరు, ఎక్కడ జరిపించారు.?
పతివ్రత అయినందున గాంధారి శాపం ఎప్పటికైనా తప్పబోదని మాధవుడికి తెలిసింది.

Lord Krishna: శ్రీకృష్ణుడి సారధ్యంలోని పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై విజయం సాధించారు.. విజయానంతరం హస్తినాపురంలో ధర్మరాజుకు పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టాభిషేకానికి యుద్ధంలో తమ వెన్నంటే ఉండి గెలిపించిన శ్రీకృష్ణుడిని అతిధిగా ఆహ్వానించారు పాండవులు. అయితే కొడుకులను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో ఉన్న గాంధారి దాన్ని భరించలేకపోయింది. యుద్ధం ఆపగలిగే శక్తి ఉన్నా.. కురువంశ వినాశనాన్ని కోరుకున్న కృష్ణుడిపై తన కోపాన్ని వెళ్లగక్కింది గాంధారి.

ఏ విధంగా ఐతే తన వంద మంది కొడుకులను పోగొట్టుకొని తాను దుఃఖసాగరంలో మునిగిపోయిందో.. అదే విధంగా కృష్ణుడు ఏలుతున్న ద్వారకా నగరం కూడా సముద్రంలో మునిగిపోతుందని గాంధారి శపించింది. ఆవేశంలో ఆమె ఆ మాట అన్నప్పటికీ.. పతివ్రత అయినందున గాంధారి శాపం ఎప్పటికైనా తప్పబోదని మాధవుడికి తెలిసింది. అందుకే తన కళ్ళముందే ద్వారకా నగరం సముద్రగర్భంలో కలిసిపోవడం చూడలేని శ్రీకృష్ణుదు తపోవనానికి వెళ్ళిపోయాడు.

ద్వారక నగరానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఓ తపోవనంలో కృష్ణుడు తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. అదే సమయాన ద్వారకలో కృష్ణుడి తండ్రి వసుదేవుడు ప్రాణం విడిచాడు. ఆయన అంత్యక్రియలు వెనువెంటనే జరిపించాల్సి వచ్చింది. బలరాముడు కూడా లేనందున.. సమస్త బంధుగణం మధ్య ఆ కార్యక్రమాన్ని అర్జునుడే దగ్గరుండి జరిపించాడు. కార్యక్రమానంతరం అర్జునుడు శ్రీకృష్ణుడికి ఈ వార్త చెప్పాలని వెతుక్కుంటూ తపోవనంకు వెళ్లాడు. కానీ అక్కడ కృష్ణుడు కనిపించలేదు.

రెండో రోజు ఒకచోట శ్రీకృష్ణుడు కనిపించాడు కానీ.. ప్రాణం లేకుండా. శ్రీకృష్ణుడిని విగతజీవుడిగా చూసిన అర్జునుడు హతాశుడయ్యాడు, రోదించాడు. శ్రీకృష్ణుడు అరణ్యంలో ఉన్నప్పుడు బోయవాడి బాణం కాలిలో దిగడం వల్ల ఆయన దేహాన్ని వదిలేసి 4-5 రోజులు గడించిందని తెలుసుకున్నాడు. అందువల్ల కృష్ణుని మృతదేహాన్ని ద్వారకకి తీసుకువెళ్ళే వీలు లేకుండా పోయింది. ఏ ఆర్భాటమూ, ఏ శాస్త్రమూ లేకుండా అదే చోట అర్జునుడొక్కడే శ్రీకృష్ణుడి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేసాడు.

ఎనిమిది మంది భార్యలు, ఎనభై మంది సంతానం, మనుమలు, విపరీతమైన బలగం, అఖండమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ.. శ్రీకృష్ణుడి అంత్యక్రియల సమయానికి బావ అయిన అర్జునుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడికి ఇద్దరు కుమారులున్నా.. ఆయనకి కూడా వాళ్ల చేతులమీదుగా అంత్యక్రియలు జరుగలేదు.


Tags

Read MoreRead Less
Next Story