Earthquakes : దేశంలో 4 గంటల్లో 5 భూకంపాలు..

Earthquakes : దేశంలో 4 గంటల్లో 5 భూకంపాలు..

Maharashtra : మహారాష్ట్రలో హింగోళి జిల్లా దాని పరిసర ప్రాంతాల్లో ఇవాళ ఉదయం రెండు సార్లు భూకంపం సంభవించింది. మొదటి భూకంపం 6.08 గంటలకు సం భవించగా.. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.5గా నమోదైంది. రెండవ భూకంపం 6.19 గంటలకు సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 3.6 గా నమోదైంది. రెండవ భూకంప సమయంలో సుమారు10 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.

దీంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అరుణాచల్ ప్రదేశ్లో మూడు సార్లు అరుణాచల్ ప్రదేశ్లోనూ ఇవాళ తెల్లవా రుజామున మూడు సార్లు భూకంపం సం భవించింది. మొదటి భూకంపం 1:49 గంటలకు.. రెండవ భూకంపం 3.40 గంటలకు సంభవించింది. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7, 3.4గా నమోదయ్యా యి.

ఇక మూడవ భూకంపం.. 5.13 గంటలకు సంభవించింది. ఇది రిక్టర్ స్కేల్ పై 3.2గా నమోదైంది. అటు మహా రాష్ట్రలో ఇటు అరుణాచల్ ప్రదేశల్ సంభ వించిన భూకంపాల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Tags

Read MoreRead Less
Next Story