Warangal : కాజీపేట రైల్వే స్టేషన్‌లో మంటలు

Warangal : కాజీపేట రైల్వే స్టేషన్‌లో మంటలు

Warangal : వరంగల్ కాజీపేట రైల్వే స్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆగివున్న రైలులో మంటలు చెలరేగడంతో అక్కడంతా భయాందోళన వాతావరణం నెలకొంది. మంటలతో పాటు భారీగా పొగ అలుముకుంది. ఆ ప్రాంత మంతా చీకటి మయం అయ్యింది.

అగ్నిప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. మంటలు చెలరేగిన బోగీ వద్దకు వెళ్లారు. మంటలను అదుపు చేశారు. ఆగివున్న రైలు బోగీలో మంటలు ఎలా చెలరేగాయనేది తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేశామనీ రైల్వే పోలీసులు తెలిపారు. విచారణ తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

రైలు బోగీలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేరనీ.. దాంతో పెను ప్రమాదం తప్పిందని రైల్వే సిబ్బంది తెలిపారు. కొన్నాళ్లుగా ఇండియన్ రైల్వేలో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఒకదాని తర్వాత మరోటి సంభవించాయి. కొన్ని ప్రమాదాల్లో ప్రయాణికులు చనిపోగా.. ఇంకొన్ని ప్రమాదాలు ప్రయాణికుల్లో భయాందోళనను రేకెత్తించాయి. తాజాగా కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆగివున్న రైలు బోగీలో చెలరేగిన మంటలు జనాన్ని పరుగులు పెట్టించాయి.

Tags

Read MoreRead Less
Next Story