PM Modi : నేడు తెలుగు రాష్ట్రాల్లో మోదీ పర్యటన
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు తెలంగాణలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం కరీంనగర్ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత వరంగల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. అనంతరం ఏపీలోని రాజంపేట బహిరంగ సభ, విజయవాడ రోడ్షోలో ఆయన హాజరు కానున్నారు.
ఇటీవల రాజమండ్రి, అనకాపల్లి సభల్లో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ రోజు మరోసారి రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు అన్నమయ్య జిల్లా కలికిరిలో నిర్వహించే ఎన్నికల బహిరంగసభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి రాత్రి 6.30 గంటలకు గన్నవరం చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియానికి వస్తారు. అక్కడి నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్ షో నిర్వహిస్తారు.
నిన్న రాత్రి హైదరాబాద్ కు చేరుకున్న మోదీ.. రాత్రి రాజ్భవన్లోనే బస చేశారు.. కాసేపటి క్రితమే హెలికాప్టర్ లో వేములవాడకు బయలుదేరారు. అక్కడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా వేములవాడ బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్కు చేరుకుంటారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com