TS : వర్ధన్నపేటలో విషాదం.. నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి

TS : వర్ధన్నపేటలో విషాదం.. నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి

వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో విషాదం జరిగింది. నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఇంటర్ విద్యార్థులు మరణించారు. ఇంటర్ ఫలితాల్లో పాస్ కావడంతో పొన్నం గణేశ్.. తన ముగ్గురు స్నేహితులైన వరుణ్ తేజ్, పొన్నాల రనిల్, సిద్ధులకు సాయంత్రం పార్టీ ఇచ్చాడు. అనంతరం ఒకే బైకుపై నలుగురు ఇంటికి వెళ్తుండగా ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు 50 మీటర్ల దూరంలో ఎగిరిపడి, ప్రాణాలు వదిలారు. కాగా మృతదేహాలను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

వరంగల్ నగర శివారు మడికొండలో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభకు జనాలను తీసుకు వెళ్లిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు తిరుగు ప్రయాణమైంది.ఆ బస్సు వర్ధన్నపేట శివారు ఆకేరు వాగు బ్రిడ్జి వద్దకు చేరుకోగా.. బైక్ పై వెళ్తున్న నలుగురు స్నేహితులు అతి వేగంగా ఆ బస్సును ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో వర్ధన్నపేటకు చెందిన పొన్నం గణేశ్‌, ఇల్లంద గ్రామానికి చెందిన మల్లేపాక సిద్ధు, వరుణ్‌ తేజ్‌, పొన్నాల రనిల్‌ కుమార్‌ తీవ్రంగా గాయపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story