పార్టీకి ద్రోహం చేసిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు: చంద్రబాబు
By - TV5 Telugu |9 Jun 2020 8:33 PM GMT
పార్టీకి ద్రోహం చేసినవారంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అలాంటి వారిని ప్రజలు ఆదరించరని.. వారికి దూరంగా వుండాలని పార్టీ ప్రజాప్రతినిధులు, ఇంఛార్జ్లకు సూచించారు. భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. జగన్ ఏడాది పాలనలో రైతులు, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు. అనేక పథకాలు రద్దు చేశారని, కొన్నింటికి ఆంక్షలు పెట్టి, భారీగా కోతలు విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కిట్లు, బ్లీచింగ్ పౌడర్ను కూడా వదలకుండా స్కామ్లకు పాల్పడ్డారని అన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వీటన్నింటినీ చర్చకు తీసుకురావాలని పార్టీ నేతలకు సూచించారు బాబు. రైతులు, పేదల సమస్యలపై టీడీపీ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com