ఏపీ కొత్త మంత్రులు శనివారం రోజున కొలువుదీరబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వెలగపూడిలోని అసెంబ్లీ పార్కింగ్ స్థలంలో వేదికను సిద్ధం చేస్తున్నారు CRDA అధికారులు. అదే రోజున సీఎం జగన్ తొలి సారి సచివాలయానికి రానున్నారు. ఉదయం ఎనిమిదిన్నరకు సచివాలయంలోని సీఎం చాంబర్ లో కూర్చొని అనంతరం మంత్రుల ప్రమాణస్వీకారంలో పాల్గొంటారు.