AP : ఏపీ రాత మార్చేస్తాం.. ఒక్క చాన్సివ్వండి.. పవన్ హాట్ కామెంట్

Update: 2024-04-29 08:20 GMT

ప్రధాని మోడీ దగ్గర ఏదైనా మాట్లాడాలంటే జగన్‌కు భయమన్నారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. జగన్ మోదీ దగ్గరకు వెళ్లి కేసులు కొట్టేయాలని కోరుతారని అన్నారు. తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదని, మోదీతో తాను ధైర్యంగా మాట్లాడగలనని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

కష్టాల్లో ఉన్న రైతుల కన్నీరు తుడవడమే తనకు ఆనందం అని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని ఏళేశ్వరం సభలో పవన్‌ వ్యాఖ్యానించారు. మాఫియా డాన్‌లతో పోరాడుతున్నామన్న పవన్‌.. మన దశ దిశ మార్చుకునే ఎన్నికలు ఇవి అని అన్నారు. ఎన్డీఏ మేనిఫెస్టోను ఎల్లుండి ప్రకటించనున్నట్టు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం అని అన్నారు. పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి జిల్లాలోకి బయటివారిని రానివ్వరు, కానీ వారు మాత్రం పక్క జిల్లాలకు వచ్చి దోచుకుంటారని పవన్‌ ఆరోపించారు.

అధికారంలోకి వచ్చాక పంతాడ అక్రమ మైనింగ్‌ను క్రమబద్ధీకరిస్తామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రాగానే ఎయిడెడ్‌ విద్యాసంస్థలను పునరుద్ధరిస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం రాగానే భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామన్నారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవని పవన్‌ అన్నారు. జగన్‌ సారా అమ్ముతూ రూ.40వేల కోట్లు సంపాదించారని ఆరోపణలు చేశారు.

Tags:    

Similar News