ఏపీలో గవర్నర్ను మార్చే ఆలోచనే లేదన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్. సేవాభావంతో బీజేపీలోకి వచ్చే వారిని ఆహ్వానిస్తామన్నారు. పార్టీలో అంతర్గత చర్చ తర్వాతే టీడీపీ రాష్ట్రస్థాయి నేతలను బీజేపీలో చేర్చుకుంటామన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో జీవీఎల్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చిన జీవీఎల్ ముఖ్యమంత్రితో పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.