త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ ను ముఖ్య అథితిగా ఆహ్వానించనున్నారు. త్వరలో అమరావతిలోని జగన్ నివాసానికి వెళ్లనున్న కేసీఆర్.. సీఎం జగన్ ను ప్రారంభోత్సవానికి రావలసిందిగా స్వయంగా ఆహ్వానించనున్నారు. కాగా ఇటీవలే సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలోని పలు పంపుహౌస్లు, బ్యారేజీ పనులను స్వయంగా పర్యవేక్షించారు.