ప్రాంతీయ బోర్డుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్

Update: 2019-06-13 13:20 GMT

ఏపీలో ఐదు ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలో

రాయలసీమ ప్రాంతీయ బోర్డు డెవలప్ మెంట్ ఛైర్మెన్ గా మాజీ ఎంపీ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి నియమితులయ్యారు. ఇక నెల్లూరు - ప్రకాశం డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మెన్ గా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, కృష్ణా- గుంటూరు ప్రాంతీయ బోర్డు ఛైర్మెన్ గా మాజీ మంత్రి పార్థసారధిని నియమించారు, అలాగే ఉభయగోదావరి జిల్లాల డెవలప్మెంట్ బోర్డు ఛైర్మెన్ గా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మెన్ గా సీనియర్ నేత, మాజీ మంత్రి, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావును ఎంపిక చేశారు జగన్.

Similar News