ఫిరాయింపులు, సంప్రదాయాలు, వెన్నుపోట్లు.. అసెంబ్లీ సమావేశాల్లో రెండోరోజు ఇవే మాటలు ఎక్కువగా వినిపించాయి.. అధికార, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు పేలాయి.. పార్టీ ఫిరాయింపులపై మఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో జరిగింది. గత ప్రభుత్వం ఆలోచించినట్టుగానే తానూ ఆలోచించి ఉంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కేది కాదని చంద్రబాబును ఉద్దేశించి జగన్ తీవ్ర విమర్శలు చేయగా.. చంద్రబాబు కూడా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు.. వైఎస్సార్ పేరును ప్రతిపక్ష నేత సభలో ప్రస్తావించడంతో అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారు.. ముఖ్యమంత్రి జగన్ కలుగజేసుకుని గతంలో ఎన్టీఆర్ ఏమన్నారో చూపించమంటారా అంటూ మాటలతో ఎదురుదాడి చేశారు.