ప్రత్యేక హోదా ఇచ్చే వరకు హోదా అవసరాన్ని గుర్తు చేస్తునే ఉంటామని అన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. విభజన చట్టంలోని హామీల అమలుపై చర్చించారు. ఏపీలో ప్రస్తుత ఆర్ధిక పరిస్థితిని..ప్రత్యేక హోదా అవసరాన్ని వివరించినట్లు జగన్ తెలిపారు. ఇక వైసీపీకి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ఆఫర్ పై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు జగన్. అనవసర ప్రచారం చేయొద్దని అన్నారు.