రాజ్యసభలో సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకే..టీడీపీ ఎంపీలను చేర్చుకున్నామని చెప్పారు బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు. రాజ్యసభలో సంఖ్యాబలం లేని కారణంగా కొన్ని చట్టాలను తేలేకపోయామని, 2021 నాటికి పూర్తి మెజారిటీ సాధించి వాటికి కార్యరూపం ఇస్తామని అన్నారు. ఆరోపణలు ఉన్నవారు ఎవరైనా సరే.. బీజేపీలో చేరినప్పటికీ అభియోగాలను ఎదుర్కోవాల్సిందేనని జీవీఎల్ స్పష్టం చేశారు.